Sunday, April 28, 2024

స్వ‌ర్గాన్ని త‌ల‌పిస్తోన్న యాదాద్రి – హీరో శ్రీకాంత్

యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామిని ద‌ర్శించుకున్నారు హీరో శ్రీకాంత్. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంతరం స్వామివారి ఆలయంలో అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. గతంలో ఉన్న ఆలయానికి ప్రస్తుత ఆలయానికి పొంతనే లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి ఆలయాన్ని ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి చేయడం గొప్ప విషయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక యజ్ఞంలా యాదాద్రి అభివృద్ధి చేశారని అన్నారు. అద్భుతమైన కట్టడాలతో యాదాద్రి పునర్నిర్మించారని ఆయన పేర్కొన్నారు. స్వ‌ర్గంలో అడుగుపెట్టినట్టుగా ఉందన్నారు. తిరుపతి తరహాలో అభివృద్ధి జరగడం అదృష్టంగా భావిస్తున్నా. చాలా రోజుల తరువాత యాదాద్రికి వచ్చానని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement