Thursday, May 9, 2024

మంట కలిసిన మానవత్వం.. ఇంటి కోసం వృద్దురాలిని గెంటేసిన మహిళ..

డబ్బుకు లోకం దాసోహం అనే సామేత ఊరికే పుట్టలేదనిపిస్తుంది. నేటి కాలంలో సమాజంలో జరుగుతున్న కొన్ని ఘటనలను చూస్తుంటే.. మనిషి ఆస్తి కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతున్నాడు. చివరికి మానవ సంబంధాలను కూడా మంట కలిపేస్తున్నాడు. కన్నవారు, కట్టుకున్నవారు, తోబుట్టువులు, బంధువులు అని ఇలాంటివి బలహీనతలుగా భావించి, అన్నీటికి చితిపెట్టేస్తున్నాడు. అలాంటి ఘటనే ఒకటి జరిగింది. మానవత్వం మంటగలిసింది. బుక్కెడన్నం పెట్టాల్సిందిపోయి వృద్దురాలు కొచ్చిన రెండుపడకల గదుల ఇంటికోసం మూర్ఖంగా ఇంట్లో నుంచి ఓ మహిళ గెంటేసింది. ఆ వివరాలు చూస్తే..ఈ ఇల్లు నీది కాదే.. నాదాంటూ కోపంగా వృద్ధురాలి వస్తువులను బయట వేసి వృద్దురాలు పట్ల మూర్ఖంగా ప్రవర్తించిది. దింతో ఆ వృద్దురాలికి స్వల్ప గాయాలయ్యాయి.ఈ ఘటన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం గ్రామంలో జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement