Monday, April 29, 2024

ఎట్టి ప‌రిస్థితుల్లో పాద‌యాత్ర ఆపే ప్ర‌స‌క్తే లేదు – బండి సంజ‌య్‌

ప్ర‌జాసంగ్రామ‌యాత్ర ఎట్టి ప‌రిస్థితుల్లో ఆపే ప్ర‌స‌క్తే లేద‌ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అన్నారు. యాధావిధిగా భ్రద‌కాళి ఆల‌యం వ‌ర‌కు కొన‌సాగుతుందని బండి సంజ‌య్‌ స్పష్టం చేశారు. అరెస్ట్ చేసి కరీంనగర్ కు తరలిస్తున్న క్రమంలో ఆయన మాట్లాడారు. శాంతియుతంగా నిర్వ‌హిస్తున్న పాద‌యాత్ర‌ను అడ్డుకోవ‌డం ప్ర‌జాస్వామ్యానికే తీర‌ని మ‌చ్చ అన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్ర‌జాసంగ్రామ‌యాత్ర కొన‌సాగి తీరుతుందన్నారు.

టీఆర్ఎస్ పార్టీ వైఫ‌ల్యాల‌ను, అవినీతి అక్రమాల‌ను ఎండ‌గ‌డుతూనే ఉంటామ‌ని.. ఆపే ప్ర‌స‌క్తే లేదన్నారు. పాద‌యాత్ర‌కు అడ్డంకులు సృష్టిస్తున్న టీఆర్ఎస్ పార్టీపై న్యాయ‌ప‌రంగా పోరాటం చేస్తామన్నారు. అంత‌కంటే ముందు జనగామ జిల్లా పాదయాత్రలో రెండు గంటలపాటు బీజేపీ కార్యకర్తల అరెస్టుకు నిరసనగా దీక్ష చేసేందుకు ప్రయత్నించగా బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం విధిత‌మే.

Advertisement

తాజా వార్తలు

Advertisement