Friday, May 3, 2024

నేను అధ్యక్షుడిగా ఉండగా.. బీఆర్ఎస్ తో పొత్తు కలే.. రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తుపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్షుడిగా ఉండగా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని వెల్లడించారు. మాఫీయాతో కాంగ్రెస్ ఎప్పటికీ చేతులు కలపదన్నారు. తెలంగాణలో ధృతరాష్ట్ర కౌగిలికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. తెలంగాణ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు ఈ సారి ప్రజలు 80 సీట్లు కట్టబెడతారని చెప్పారు. ఈ సారి కేసీఆర్ కు 25 కంటే ఎక్కువ సీట్లు రావని జోస్యం చెప్పారు. అటు బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య ట్రయాంగిల్ లవ్ నడుస్తోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement