బీఆర్ఎస్ పార్టీకీ కార్యకర్తలే బలమని, ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ క్రియాశీల కార్యకర్త గజ్జల దినేష్ కుమార్ రోడ్డు ప్రమాదమలో మరణించగా అతని కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తరపున మంజూరైన బీమా డబ్బులు 2 లక్షల రూపాయల చెక్కును అతని కుటుంబ సభ్యులకు మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం మీ సేవ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చనిపోయిన కార్యకర్త కుటుంబానికి పార్టీ బీమా చెక్కు కొండత భరోసా అన్నారు. పార్టీ కార్యకర్త చనిపోతే రెండు లక్షల రూపాయల భీమా అందిస్తున్న ఏకైక పార్టీ దేశంలో బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు. కార్యకర్తలు లేనిదే నాయకులు లేరనీ, ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement