Tuesday, May 14, 2024

మునుగోడులో భారీ మెజార్టీతో గెలుస్తాం… కిషన్ రెడ్డి

మునుగోడులో భారీ మెజార్టీతో గెలుస్తామని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… మునుగోడు ఉప ఎన్నికకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. రైతుల కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టాలని తమ ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఎంఐఎంను బలోపేతం చేసేందుకే కేసీఆర్ జాతీయ పార్టీ అన్నారు. టీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. వైఫల్యాల నుంచి చర్చ మరల్చేందుకే కేసీఆర్ పార్టీ అని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ తో దేశంలో ఏ పార్టీ కలిసి రావడం లేదన్నారు. కేసీఆర్ కాళ్ల కింద భూమి కదులుతోందన్నారు. తెలంగాణలో ఫాంహౌస్ ల పాలన పోవడం ఖాయమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement