Friday, April 26, 2024

అంతర్జాతీయ మార్కెట్ గా తీర్చిదిద్దుతాం .. మంత్రి పువ్వాడ

ఖమ్మం : ఖమ్మం మార్కెట్ ను అంతర్జాతీయ మార్కెట్ కు చిరునామాగా తీర్చిదిద్దుతామని, చిల్లీస్ కు హబ్ గా చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో తేజ రకం కొత్త మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలికింది. ఖమ్మం మార్కెట్ చరిత్రలో అత్యధికంగా క్వింటాల్‌ మిర్చికి రూ. 25,550 పలకడం ఇదే ప్రథమం. సోమవారం ఖమ్మం వ్యవసాయ మిర్చి మార్కెట్ నందు నిర్వహించిన జెండా పాటలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని జెండా పట్టి ధర నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వంలో ఖమ్మం మిర్చి మార్కెట్ లో రికార్డు స్థాయిలో ధర పలికిందన్నారు. కొన్ని క్వింటాలే కాదు… రైతులు పండించిన ప్రతి బస్తాలను కొనుగోలు చేస్తారన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.

తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం లాభసాటిగా మారిందని, మనం పండించే మిర్చికి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉందన్నారు. ఖమ్మంలో చైనా దేశం మిర్చి కంపెనీలు ఏర్పాటు చేసి చైనాకి క్వాలిటీ మిర్చి ఎగుమతి చేస్తున్నామన్నారు. మిర్చి ఘాట్ కంటే రైతుల మీద ప్రేమ ఎక్కువ అని, అందుకే రైతుల ప్రయోజనాలు ముఖ్యమన్నారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ దోరేపల్లి శ్వేత, వైస్ చైర్మన్ షేక్ అఫ్జల్, ఉన్నత శ్రేణి కార్యదర్శి రుద్రాక్ష మల్లేశం, ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిన్ని కృష్ణారావు, దిగుమతి శాఖ అధ్యక్షులు దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, పత్తిపాక రమేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement