Monday, April 29, 2024

నూక‌లైనా తింటాం- కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించుతాం – మంత్రి హ‌రీశ్ రావు

తెలంగాణ ప్ర‌జ‌ల‌ను కించ‌ప‌ర‌చేలా కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ వ్యాఖ్య‌లు చేశార‌ని మండిప‌డ్డారు మంత్రి హ‌రీశ్ రావు. బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు శుక్ర‌వారం నాడు మీడియాతో మాట్లాడిన హ‌రీశ్ రావు తెలంగాణ ప‌ట్ల కేంద్రం వివక్ష గోయ‌ల్ వ్యాఖ్య‌ల‌తో మ‌రోమారు బ‌ట్ట‌బ‌య‌లైంద‌ని ఆరోపించారు. తెలంగాణ రైతుల‌ను అవ‌మానిస్తే ఊరుకునేది లేదని చెప్పిన హ‌రీశ్.. తెలంగాణ ప్ర‌జ‌లు నూక‌లు తినాలంటూ గోయ‌ల్ వ్యాఖ్యానించ‌డం తెలంగాణ ప్ర‌జ‌ల‌ను అవ‌మానించిన‌ట్టేన‌ని తేల్చిచెప్పారు.గోయ‌ల్ ఓ కేంద్ర మంత్రిలా కాకుండా ఓ వ్యాపారిలా మాట్లాడుతున్నార‌ని కూడా హ‌రీశ్ ధ్వ‌జ‌మెత్తారు. నూక‌లైనా తింటాం గానీ కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించుతామ‌ని హ‌రీశ్ ప్ర‌తిన‌బూనారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement