Sunday, April 28, 2024

ధ్వంస‌మైన తెలంగాణ‌ను పున‌ర్ నిర్మిస్తున్నాం : సీఎం కేసీఆర్

ధ్వంస‌మైన తెలంగాణ‌ను పున‌ర్ నిర్మిస్తున్నాం అని ముఖ్య‌మంత్రి శ్రీ కేసీఆర్ గారు స్ప‌ష్టం చేశారు. అన్ని క‌ష్టాలు అధిగ‌మించి దేశం గ‌ర్వించేలా అభివృద్ధి చేస్తున్నాం. తిగి బాగు చేసుకోవ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుంది. ప‌ల్లె, పట్ట‌ణ ప్ర‌గ‌తికి దేశ వ్యాప్తంగా గుర్తింపు ల‌భించింద‌ని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి చేప‌ట్ట‌బోయే ప‌ల్లె, పట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల‌పై మంత్రులు, మేయర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, సంబంధిత శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్ల‌తో ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అధికారుల‌కు సీఎం కేసీఆర్ ఈ కార్య‌క్ర‌మాల అమ‌లుపై దిశానిర్దేశం చేస్తున్నారు.

అదే ప్ర‌గ‌తికి కొల‌మానం..
మనం చేస్తున్న పనిని ఇతరులు గుర్తించడమే ప్రగతికి కొలమానమనీ, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు, ఆదరణ లభించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రెండు పర్యాయాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ గ్రామాల్లో మొదటి దశలో పదికి పది గ్రామాలు, రెండవ దశలో 20కి 19 గ్రామాలు తెలంగాణ నుంచే ఎంపిక కావడం గొప్ప విషయమని అన్నారు. ఈ దిశగా కృషి చేసిన పంచాయతీ రాజ్ శాఖను, మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావును సీఎం కేసీఆర్ అభినందించారు.

ఫ‌లితాలు ఊరికే రావు..
ఫలితాలు ఊరికే రావు.. ప్రజల సంక్షేమం దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న కార్యాచరణలో అధికారులు శ్రద్ధాసక్తులతో, చిత్తశుద్ధితో పాల్గొన్నప్పుడే ఫలితాలు సాధ్యమ‌వుతాయ‌ని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ నూతన పంచాయతీ రాజ్ చట్టం తెచ్చినప్పుడు పలువురు పలు అనుమానాలను వ్యక్తం చేశారు. కానీ నేడు వారి అనుమానాలను పటాపంచలు చేసి తెలంగాణ పల్లెలను అభివృద్ధి పథాన నడిపించుకుంటున్నాం. ప్రతి గ్రామానికి మౌలిక వసతులను ఏర్పాటు చేసుకొని ప్రగతి సాధిస్తున్నాం. ప్రతీ పల్లెలో ఇవ్వాల ఒక ట్రాక్టర్ ను ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేసుకున్నాం. ప్రభుత్వం చేపట్టిన చర్యలు నేడు గ్రామాల్లో స్ఫూర్తిని నింపాయ‌ని సీఎం తెలిపారు.

నాడు న‌వ్వుకున్న‌రు.. కానీ నేడు అగ్ర‌భాగాన‌
తాను గతంలో చెప్పినట్టు… ఎస్‌కే డే ప్రారంభించిన పంచాయతీ రాజ్ వ్యవస్థ ఒక ఉద్యమం. కానీ నేడు అందులో రాజకీయాలు ప్రవేశించి అవి అన్ని రకాలుగా పంచాయతీ రాజ్ స్ఫూర్తి చంపివేయబడ్డదని కేసీఆర్ అన్నారు. దేశంలో ప్రారంభమైన సహకార ఉద్యమం కూడా కలుషితం చేయబడ్డది. ఇటువంటి అరాచకమైన, నిర్లక్ష్యమైన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభ దశలో తీసుకున్న నిర్ణయాలు, ఎంచుకున్న ప్రాధాన్యతా క్రమాలు కొందరికి జోక్ లాగా కనిపించాయి. తెలంగాణ వచ్చిన ప్రారంభంలో తాను అటవీ శాఖ, అడవుల పరిరక్షణ మీద సమీక్ష సమావేశం నిర్వహిస్తే ఈ అడవులేంది అని కొందరు నవ్వుకున్నారు. కానీ నేడు దేశ పర్యావరణం, పచ్చదనంలో భాగస్వామ్యం పంచుకోవడంలో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. తెలంగాణ వచ్చేనాటికి అస్తవ్యస్తంగా, యుద్ధవాతావరణంతో కూడుకొని ఉన్న గ్రామీణ మంచినీటి వ్యవస్థను ఇవాళ‌ దేశం గర్వించేలా మిషన్ భగీరథ ద్వారా తీర్చిదిద్దుకున్నాం. ఇంటింటికి స్వచ్ఛమైన త్రాగునీటిని అందిస్తున్న పరిస్థితి దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

ఆ ప్ర‌సారాలు చూసి ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు..
అన్ని రంగాల్లో జరిగిన తెలంగాణ అభివృద్ధిని ఇటీవల కొన్ని జాతీయ మీడియా చానెల్స్ ప్రసారం చేశాయ‌ని కేసీఆర్ గుర్తు చేశారు. ఇది చూసిన ఇతర రాష్ట్రాల వారికి ఆశ్చర్యం కలిగింది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గురించి త‌న‌కు ఫోన్లు చేసి అడుగుతన్నారు. అంటే మనం అనతికాలంలో అనితర సాధ్యమైన అభివృద్ధిని సాధించాం. ఇందులో భాగస్వాములైన ప్రజా ప్రతినిధులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని సీఎం పేర్కొన్నారు.

- Advertisement -

ప‌ద్మ‌శ్రీ తిమ్మ‌క్క‌కు ఘ‌నంగా స‌న్మానం..
ఈ సందర్భంగా.. పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ కోసం తన జీవితాన్ని అర్పించిన పద్మశ్రీ తిమ్మక్క(110) మంత్రులు, ఉన్నతాధికారుల సమక్షంలో సీఎం కేసీఆర్ ఘ‌నంగా సన్మానించారు. తిమ్మ‌క్క క‌ర్ణాట‌క రాష్ట్రానికి చెందిన మ‌హిళ‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement