Saturday, April 27, 2024

ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌గా వార్నర్‌..

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ పురస్కార విజేతలను ప్రకటించింది. పురుషుల విభాగంలో ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఈ అవార్డును దక్కించుకున్నాడు. మహిళల్లో వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ హేలీ మ్యాథ్యూస్‌ విజేతగా నిలిచింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను తొలిసారిగా ఆస్ట్రేలియా గెలుచుకోవడంలో విధ్వంసక ఓపెనర్‌ వార్నర్‌ కీలకపాత్ర పోషించాడు. దీంతో నవంబర్‌ నెలకు సంబంధించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌కు ఎంపికయ్యాడు.

అబిద్‌ అలీ, టిమ్‌ సౌథీలను అధిగమించి వార్నర్‌ విజేతగా నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రతినెల ఆయా సిరీస్‌ల్లో ప్రతిభచూపిన క్రికెటర్లను ప్రోత్సహించేలా ఈ ఏడాది జనవరి నుంచి ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ పురస్కారాలను ప్రారంభించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement