Thursday, May 2, 2024

కళాతపస్వి కే. విశ్వనాథ్‌ సతీమణి జయలక్ష్మి కన్నుమూత

హైదరాబాద్‌: దివంగత దర్శకుడు, కళాతపస్వి కే. విశ్వనాథ్‌ సతీమణి జయలక్ష్మి(86) ఇకలేరు. గుండెపోటుతో ఆదివారం ఆమె కన్నుమూశారు. కళాతపస్వి కన్నుమూసిన 22 రోజులకే ఆమె మృతి చెందడం గమనార్హం. ఫిబ్రవరి 2వ తేదీన వృద్ధాప్యరిత్యా సమస్యలతో దర్శకదిగ్గజం కాశీనాధుని విశ్వనాథ్‌(92) కన్నుమూశారు. ఆయన మృతి చెందినప్పటి నుంచి జయలక్ష్మి తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం గుండెపోటు రావడంతో ఆమె మృతి చెందారు. ఆమె మరణం పట్ల పలువురు సంతాపం ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement