Sunday, April 28, 2024

విశాఖ శ్రీ శారదాపీఠ ప్రస్థానంలో – మరో మణిమకుటం

విశాఖ శ్రీ శారదాపీఠ ప్రస్థానంలో – మరో మణిమకుటం.. స్వధర్మ వాహిని పేరుతో ఆధ్యాత్మిక సంస్థ ఏర్పాటు చేయ‌నున్నారు. తిరుమలలో స్వధర్మ వాహిని లోగోను ఆవిష్కరించారు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి. సనాతన ధర్మ పరిరక్షణలో నూతన ఒరవడి కోసమే స్వధర్మ వాహిని సంస్థను ఏర్పాటు చేసామ‌న్నారు స్వరూపానందేంద్ర..విశాఖ శ్రీ శారదాపీఠానికి అనుబంధంగా ఈ సంస్థ పనిచేస్తుందన్నారు స్వరూపానందేంద్ర. ధర్మ మార్గం వైపు యువతరాన్ని నడిపించడమే ఈ సంస్థ లక్ష్యం
.. మారుమూల గిరిజన, హరిజన ప్రాంతాల్లో ధర్మప్రచారం సాగిస్తామ‌న్నారు స్వరూపానందేంద్ర..యువత ద్వారా వినూత్నంగా ధర్మప్రచారాన్ని ముందుకు తీసుకెళతాం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement