Friday, April 26, 2024

విశాఖ దేశంలోనే ప్రముఖ నగరం.. ప్రధాని మోడీ

విశాఖ దేశంలోనే ప్రముఖ నగరమని, సాంకేతిక, వైద్య రంగాల్లో ఏపీకి ప్రత్యేక గుర్తింపు ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం ఏయూ గ్రౌండ్స్ లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ… రక్షణ, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో విశాఖది కీలక పాత్ర అన్నారు. ఏపీ డెవలప్ మెంట్ కోసం మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎంతో కృషి చేశారన్నారు.

వెంకయ్య, హరిబాబు, తాను ఎప్పుడు కలిసినా ఏపీ డెవలప్ మెంట్ గురించే మాట్లాడుకుంటామన్నారు. ఏపీ ప్రజలు అన్ని రంగాల్లో తమ ప్రత్యేకత చూపిస్తున్నారన్నారు. వేల ఏళ్ల క్రితమే విశాఖపట్నం పోర్టు నుంచి పశ్చిమ ఆసియా వరకు వ్యాపారం జరిగేదన్నారు. రూ.10వేల కోట్ల ప్రాజెక్టును జాతికి అంకితం చేశామని, విశాఖ ప్రజల ఆకాంక్ష నెరవేర్చామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement