Friday, May 3, 2024

జూలై 1న థియేట‌ర్ లో విరాట‌ప‌ర్వం – డేట్ ఎనౌన్స్ చేసిన చిత్ర యూనిట్

ఇప్ప‌టి వ‌ర‌కు అప్ డేట్ ఇవ్వ‌ని విరాట‌ప‌ర్వం చిత్ర యూనిట్ ఇప్పుడు అప్ డేట్ తో వ‌చ్చారు. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల తెర‌కెక్కిస్తున్నాడు.. రానా హీరోగా .. సాయి పల్లవి హీరోయిన్ గా న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియమణి కీలక పాత్రలో కనిపిస్తున్నది. ఇప్పటి వరకూ ఈ సినిమా నుండి రానా, ప్రియమణి, సాయి పల్లవి ఫస్ట్ లుక్స్ రివిల్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ లకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. దాదాపుగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నుండి ఒక కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ను ఫిక్స్‌ చేసింది. ఈ ఏడాది జూలై 1వ తేదీన ఈ సినిమాను రిలీజ్ కానున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ అధికారిక పోస్టర్ ని రిలీజ్ చేశారు. మొదట్లో ఓటీటీలో రిలీజ్‌ అవుతుందని వార్తలు వచ్చినా.. చివరికి.. థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు పేర్కొంది చిత్ర బృఃదం.

Advertisement

తాజా వార్తలు

Advertisement