Saturday, April 20, 2024

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

రోడ్డుప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలైన ఘటన ఏపీలోని శ్రీకాకుళం రూరల్ మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని పాత్రునివలస సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట గ్రామానికి చెందిన వంక జానకిరావు(28) విశాఖపట్నం నుంచి ద్విచక్రవాహనంపై స్వగ్రామం వస్తుండగా జాతీయ రహదారిపై ఆగివున్న కంటెనర్ ను వెనుక నుంచి ఢీకొని, తీవ్రగాయాలతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతునికి భార్యతో పాటు రెండేళ్ల చిన్నారి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement