Saturday, May 18, 2024

విజ‌య్ కాంత్ స‌తీమ‌ణికి ఫోన్ చేసిన ప్ర‌ధాని మోడీ-ఆరోగ్య ప‌రిస్థితిపై ఆరా

గ‌త కొంత‌కాలంగా డీఎండీకే (దేశియ మురపొక్కు ద్రవిడ కజగం) పార్టీ అధినేత విజయ్ కాంత్ డయాబెటిస్ తో బాధపడుతున్నారు. ఆయన కుడి కాలి వేళ్లకు బ్లడ్ సప్లై కావడం లేదని, ఈ నేపథ్యంలోనే వైద్యులు ఆయన మూడు కాలి వేళ్లు తొలిగించారని తెలిపారు. ఆయన కుడి కాలి వేళ్లకు బ్లడ్ సప్లై కావడం లేదని, ఈ నేపథ్యంలోనే వైద్యులు ఆయన మూడు కాలి వేళ్లు తొలిగించారని తెలిపారు. కాగా విజయ్ కాంత్ ఆరోగ్యంపై అసత్యాలు ప్రచారం చేయొద్దని డీఎండీకే పార్టీ కార్యాయలం కోరింది. తాజాగా విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్రమోడీ ఆరా తీశారు. విజయ్ కాంత్ సతీమణి ప్రేమలతా విజయ్ కాంత్ తో ఫోన్ లో మాట్లాడారు. విజయ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న మోడీ..కెప్టెన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement