Thursday, April 25, 2024

ఉప‌రాష్ట్ర‌ప‌తికి క‌రోనా – ట్వీట్ చేసిన వెంక‌య్య‌నాయుడు


ఇప్పుడు ఎక్క‌డ విన్నా క‌రోనా పేరే వినిపిస్తోంది. పొలిటీషియ‌న్స్ , సినీ సెల‌బ్రిటీలు, క్రీడాకారులు ఇలా అంతా మ‌హ‌మ్మారికి బ‌లి అవుతున్నారు. కాగా ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడికి క‌రోనా పాజిటీవ్ గా తేలింది. దాంతో వెంకయ్య నాయుడు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌ లోకి వెళ్లారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు.ఈరోజు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నాకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వైద్యుల సూచన మేరకు వారం రోజుల పాటు తాను స్వీయ నిర్బంధంలో ఉండనున్న‌ట్లు చెప్పారు. ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలి. ” అంటూ ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు ట్వీట్ లో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement