Sunday, April 28, 2024

UAE Golden Visa: ఉపాసనకు అరుదైన గౌరవం.. గోల్డెన్ వీసా ఇచ్చిన యూఏఈ ప్రభుత్వం

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ భార్య, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్ పర్స ఉపాసన కొణిదెలకు అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం ఉపాసనకు గోల్డెన్ వీసా అందించింది. ఈ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ క్రిస్మస్ కు ఓ కానుక అందుకున్నానని తెలిపారు.

ఇటీవల జరిగిన ఇండియా ఎక్స్ పో-2020 ద్వారా ఈ ప్రపంచమంతా ఒక్కటే అని తెలుసుకున్నానని, ‘వసుధైక కుటుంబం’ అనే భావనకు అర్థం తెలిసిందని ఉపాసన అన్నారు. ఈ క్రమంలో యూఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందుకోవడం సంతోషం కలిగిస్తోందని చెప్పారు. తాను భారతీయురాలిననని, అయితే అన్ని దేశాల పట్ల అపారమైన గౌరవం ఉందన్నారు. ఇప్పుడు గోల్డెన్ వీసా రాకతో అధికారికంగా ప్రపంచ పౌరురాలిని అయ్యానని ఉపాసన సంతోషం వ్యక్తం చేశారు.

 2019 నుంచి గోల్డెన్ వీసా విధానం అమలు చేస్తున్నారు. సాధారణంగా యూఏఈలో ఉద్యోగం, వ్యాపారం, చదువు కోసం వెళ్లే విదేశీయులకు అక్కడ ఎవరైనా స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది. అయితే, గోల్డెన్ వీసా ఉన్నట్టయితే నేషనల్ స్పాన్సర్ లేకుండానే యూఏఈలో తమ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. ఈ వీసా ఉంటే 100 శాతం యూఏఈ పౌరుడిగానే భావిస్తారు. గోల్డెన్ వీసాలు లాంగ్ టర్మ్ వీసాలు. ఐదేళ్లు, పదేళ్ల ప్రాతిపదికన జారీ చేస్తారు.

కాగా, ఇప్పటికే అనేకమంది భారత ప్రముఖులు యూఏఈ గోల్డెన్ వీసాలు అందుకున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, మలయాళ నటులు మమ్ముట్టి, మోహన్ లాల్, దుల్కర్ సల్మాన్, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తదితరులు ఈ గోల్డెన్ వీసా అందుకున్నారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement