Thursday, April 25, 2024

సీఎం యోగిని క‌లిసిన- మేజ‌ర్ చిత్ర టీం

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఉన్నికృష్ణన్ వారసత్వాన్ని యూపీ యువతలోకి తీసుకెళ్తామని చెప్పారు సీఎం యోగి ఆదిత్య‌నాథ్. యోగి కోసం మేజ‌ర్ చిత్రం ప్ర‌త్యేక షో వేశారు.ఈ చిత్రంలో అడివి శేష్ ప్ర‌ధాన పాత్ర‌ని పోషించారు. 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రదాడులు, ఉగ్రవాదులను అంతమొందించి తన ప్రాణాలను త్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం అందరి ప్రశంసలను అందుకుంటోంది. తాజాగా మేజర్ చిత్ర యూనిట్ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలుసుకుంది. టీమ్ సభ్యులతో పాటు ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. యోగి కోసం వీరు ప్రత్యేక షో వేశారు. సినిమాను చూస్తూ యోగి భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం అందరినీ యోగి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమాను చాలా బాగా తెరకెక్కించారని ప్రశంసించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement