Friday, May 3, 2024

టెస్టు క్రికెట్‌లో 11 ఏళ్లు పూర్తి.. కూ యాప్ ద్వారా మధుర క్షణాలను పంచుకున్న విరాట్ కోహ్లీ

11 ఏళ్ల క్రితం జూన్ 20న ఇదే రోజున విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌లో తొలి మ్యాచ్ ఆడాడు. జమైకాలోని కింగ్‌స్టన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు క్రికెట్‌లో కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన కోహ్లి అరంగేట్రం చేశాడు. ఈ సందర్భంగా 11 ఏళ్ల తర్వాత ఈరోజు, కోహ్లీ తన ల్యాప్‌టాప్‌ను అన్‌లాక్ చేసి, చాలా ప్రత్యేకమైన ఫోల్డర్‌ను బహిరంగంగా తెరిచి, భారత బ్యాటింగ్ జ్ఞాపకాలను పంచుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో కోహ్లీ చాలా విజయవంతమైన కెప్టెన్సీని కలిగి ఉన్నాడు. టెస్టుల్లో 11 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాత, కోహ్లి స్వదేశీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ కూ యాప్‌లో టెస్ట్ క్రికెట్‌లోని తన ప్రధాన క్షణాలన్నింటినీ కవర్ చేస్తూ వీడియోను పోస్ట్ చేశాడు.

33 ఏళ్ల అతను తన కెరీర్‌లో ఇప్పటివరకు 101 టెస్టులు ఆడాడు. 49.95 సగటుతో 8,043 పరుగులు చేశాడు. ఇందులో అతని అత్యధిక స్కోరు 254 నాటౌట్. అయితే ఇటీవల కాలంలో కోహ్లి ఫామ్‌లో పతనమవుతున్నాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన డే-నైట్ టెస్టులో బంగ్లాదేశ్‌పై చివరిసారిగా సెంచరీ సాధించాడు. ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాలో 1-2తో సిరీస్ ఓడిపోవడంతో కోహ్లి భారత టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. విరాట్ 68 మ్యాచ్‌ల్లో 40 విజయాలతో భారత్‌కు అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్‌గా నిలిచాడు. అతను టెస్ట్ క్రికెట్ చరిత్రలో గ్రేమ్ స్మిత్, అలన్ బోర్డర్, స్టీఫెన్ ఫ్లెమింగ్, రికీ పాంటింగ్ క్లైవ్ లాయిడ్ తర్వాత అత్యంత విజయవంతమైన ఆరో కెప్టెన్. ఇప్పుడు ఇంగ్లండ్‌తో జూలై 1 నుంచి 5 వరకు జరిగే ఏకైక టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ కనిపించనున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement