Thursday, May 9, 2024

బిజెపిపై ఫైర్ అయిన ప్ర‌కాశ్ రాజ్ – మ‌ద్ద‌తు తెలుపుతోన్న నెటిజ‌న్స్

అగ్నివీరులపై చేసిన ప్రకటనపై ప్ర‌ధాని మోడీ ప్రభుత్వాన్ని విమ‌ర్శించారు న‌టుడు ప్ర‌కాశ్ రాజ్. ఈ పథకంపై ప్రకాష్ రాజ్ ప్రశ్నలు సంధించారు. అగ్నీపథ్ పథకం కింద 4 ఏళ్లపాటు సైన్యంలో రిక్రూట్ అయిన అగ్నివీరులు తర్వాత మంచి చాకలి, ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, బార్బర్‌లుగా మారవచ్చు’అని కేంద్రమంత్రి, బీజేపీ నేత కిషన్‌రెడ్డి ఇటీవల అన్నారు. మరోవైపు.. కైలాష్ విజయవర్గియా కూడా ఇదే విధమైన ప్రకటన చేశారు. నాలుగు సంవ‌త్స‌రాల అనంత‌రం అగ్ని వీరులు భార‌తీయ జనతా పార్టీ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తారనిస సంచ‌ల‌న వ్యాఖ్యాలు చేశారు. ప్రకాష్ రాజ్ తన ట్వీట్ట‌ర్ వేదిక‌గా ఇరునేత‌ల ప్ర‌క‌ట‌న‌ల‌ను చూపిస్తూ.. ‘గౌరవనీయులైన సుప్రీం.. అగ్నివీరుల భవిష్యత్తుపై మీ స్వంత పార్టీ నేత‌లు ఏమి చెబుతున్నారో చూడండి.

ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు యువత ఎలా స్పందిస్తారని అనుకోవచ్చు. విద్వేషాలు రెచ్చ‌గొట్టేలా ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నార‌ని బీజేపీ నేతలిద్దరినీ ప్రకాష్ రాజ్ దుయ్యబట్టారు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ ట్వీట్ కు సోషల్ మీడియాలో భారీ మొత్తంలో మద్దతు లభిస్తోంది. ప్ర‌కాశ్ పోస్టుకు స‌పోర్టుగా..ఓ ట్విట్టర్ వినియోగదారు ట్వీట్ చేశాడు. బీజేపీ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డు ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగమా అని రాశారు. లేదంటే.. భవిష్యత్తులో భాజపా ఖజానా నుంచి గార్డులకు శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. మరొక వినియోగదారు ఈ నాయకుల ప్రకటనలను అసంబద్ధంగా ఉన్నాయ‌ని కొట్టిపారేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement