Monday, April 29, 2024

ఈ నెల 14న ‘అమిత్ షా’తో భేటీ కానున్న ‘స్టాలిన్’..

ఈ నెల 14న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం స్టాలిన్ భేటీ కానున్నారు. ఈ మేర‌కు తిరుప‌తిలో అమిత్ షా తో స్టాలిన్ భేటీ కానున్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు ప‌లు అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు స్టాలిన్. కాగా అమిత్ షా ఏపీ పర్యటనకు రానున్నారు. అయితే ఈ సారి దైవ దర్శనానికో, బీజేపీ కార్యక్రమంలో పాల్గొనడానికో కాదు.. తన శాఖ బాధ్యతల్లో భాగంగా తిరుపతిలో నిర్వహిస్తున్న అత్యున్నత సమావేశంలో పాల్గొనేందుకు స్తున్నారు. తిరుపతిలో ఈ నెల 14న తిరుపతి తాజ్‌ హోటల్‌లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన సౌత్ జోన్ కమిటీ సమావేశం జరగనుంది. హోంమంత్రితో పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ర్టాల సీఎంలు, ముఖ్య కార్యదర్శులు, అండమాన్‌ నికోబార్‌ లక్షదీవుల కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొనాల్సి ఉంది. నిజానికి ఈ సమావేశాన్ని మార్చిలో నిర్వహించాలని అనుకున్నారు. ఏర్పాట్లు కూడా చేశారు. కానీ అప్పట్లో తిరుపతి ఉపఎన్నిక షెడ్యూల్ రావడంతో సమావేశం వాయిదా పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement