Tuesday, April 30, 2024

ఇక‌పై సైనికుల అనాథ పిల్ల‌ల‌కు సాయంగా నెల‌కి..రూ.3వేలు

ఇక‌పై సైనికుల అనాథ పిల్ల‌ల‌కు నెల‌కి రూ.3వేలు అంద‌జేయ‌నున్న‌ట్లు కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్ల‌డించారు. ఇప్పటి వరకు వీరికి నెలకు రూ. 1,000 చెప్పున లభించేది. ఇకపై రూ. 3 వేల చెప్పున అందజేస్తారు. రక్షణ దళాల్లో సేవలందించిన వారి కుటుంబాల పట్ల మానవతా దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. పెంచిన సాయంతో అనాథ పిల్లలు గౌరవప్రదంగా మెరుగైన జీవితాన్ని జీవించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. కేంద్రీయ సైనిక్ బోర్డు నిర్వహిస్తున్న పథకం ద్వారా ఈ సాయాన్ని మాజీ సైనికుల అనాథ పిల్లలకు అందిస్తారు. 21 సంవత్సరాల లోపు వయసున్న అవివాహిత కుమార్తె, కుమారుడు ఈ పథకానికి అర్హులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement