Saturday, May 11, 2024

ఆధార్ కార్డు యూజర్లకు అలర్ట్.. రెండు సర్వీసులు నిలిపివేత

ఆధార్ కార్డు వినియోగదారులకు యూఐడీఏఐ షాకింగ్ న్యూస్ వెల్లడించింది. ఆధార్ కార్డుకు సంబంధించి తాజాగా రెండు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేసింది. ఆధార్ అడ్రస్ వాలిడేషన్ లెటర్ ద్వారా అడ్రస్ మార్చుకోవడం ఇకపై సాధ్యం కాదు. దీంతో పాటు ఆధార్ కార్డు రీ ప్రింట్ సేవలు కూడా అందుబాటులో ఉండవని యూఐడీఏ తెలిపింది. ఈ రెండు సేవలు ఇక ఆధార్ కార్డు వాడే వారికి అందుబాటులో ఉండవు. అడ్రస్ వాలిడేషన్ లెటర్ ఆప్షన్ తొలగించడం వల్ల అద్దెకు ఉంటున్న వారిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే ఎలాంటి డాక్యుమెంట్లు లేని వారు కూడా ఇకపై అడ్రస్ మార్చుకోవడం సాధ్యం కాకపోవచ్చు. ఇకపోతే ఆధార్ కార్డు రీప్రింట్ సర్వీసులు కూడా అందుబాటులో ఉండవు. ఆధార్ రీప్రింట్ పొందాలని భావించే వారు పీవీసీ కార్డు రూపంలో మాత్రమే ఆధార్ కార్డు పొందాల్సి ఉంటుంది. ఇది డెబిట్ కార్డు రూపంలో ఉంటుంది.

అయితే ఆధార్ కార్డులో తప్పులను సులభంగానే మార్చుకోవచ్చు. అడ్రస్, పేరు, పుట్టిన తేదీ వంటి వాటిల్లో తప్పులు ఉంటే ఇంట్లో నుంచే అప్‌డేట్ చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే మొబైల్ నెంబర్ యాడ్ చేసుకోవడం, బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది.

ఈ వార్తలు కూడా తప్పకుండా చదవండి:

విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి నోటిఫికేషన్

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం

Advertisement

తాజా వార్తలు

Advertisement