Monday, April 29, 2024

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాజకీయ ప్రయాణం ఇలా

కేంద్ర సాంస్కృతిక‌, టూరిజం, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా జి.కిష‌న్‌రెడ్డి బాధ్య‌త‌లు స్వీకరించారు. కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రిగా ఉన్న కిష‌న్‌రెడ్డికి ప్ర‌ధాని మోదీ జంబో క్యాబినెట్‌లో ప్ర‌మోష‌న్ ల‌భించి కేబినెట్ హోదా ద‌క్కింది.

సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి ఎమ్మెల్యేగా, శాసనసభాపక్ష నేతగా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎదిగి, ప్రస్తుతం కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి నాలుగోసారి అనూహ్యంగా ఓటమిపాలైన కిషన్ రెడ్డి.. అనంతరం సికింద్రాబాద్ ఎంపీగా గెలుపొందారు.

రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు కిషన్ రెడ్. 1977లో రాజకీయాల్లో వచ్చిన కిషన్ రెడ్డి అప్పటి జనతా పార్టీలో యువజన విభాగం నేతగా పనిచేశారు. 1980లో భారతీయ జనతాపార్టీ ఆవిర్భవించాక ఆ పార్టీలో చేరారు. బీజేపీలో సాధారణ కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రస్థాయిలో, జాతీయ స్థాయిలో వివిధ హోదాల్లో పని చేవారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2002 నుంచి  2004 వరకు బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షునిగా పని చేశారు. 1999లో కార్వాన్ నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన కిషన్ రెడ్డి.. తొలి ఎన్నికల్లో ఓటమి పాలైయ్యారు. 2004లో హిమాయత్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పడిన అంబర్ పేట నుంచి 2009, 2014లో వరుసగా విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా దాదాపు ఆరేళ్లపాటు పని చేశారు. అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా రెండుసార్లు వ్యవహరించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన కిషన్ రెడ్డి 2019 లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత మోదీ కేబినెట్ లో హోంశాఖ సహాయ మంత్రిగా చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం కేబినెట్ మంత్రి స్థాయికి ఎదిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement