Thursday, May 2, 2024

తెలంగాణలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు!

తెలంగాణలో కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే 70 డెల్టా వేరియంట్ కేసులను గుర్తించారు. అయితే ఈ 70 కేసుల్లో రెండు కేసులు తెలంగాణలో నమోదు అయ్యాయి. డెల్టా ప్లస్ కేసులు వచ్చినవారిలో ఒకరు ఓ వైద్యుడి బంధువు కాగా, మరొకరు విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణలో వెయ్యి లోపే కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కరోనా ఉద్ధృతి పెరుగడం ఆందోళన కలిగిస్తోంది. గాంధీలో సివియారిటీ కేసులు పెరుగుతున్నట్లు గాంధీ సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. కోవిడ్‌ వైరస్‌ పూర్తిగా పోవడం వల్లే ప్రభుత్వం ఆంక్షలు ఎత్తేసినట్లు చాలా మంది భావిస్తున్నారన్నారు. నిజానికి వైరస్‌ పూర్తిగా పోలేదని, కేవలం కేసుల సంఖ్య మాత్రమే తగ్గిందన్నారు. ప్రజలు మాస్క్‌లు ధరించడం, శానిటైజర్లు వినియోగించడం మానేశారన్నారు. భౌతిక దూరం పాటించడం లేదన్నారు. మార్కెట్లు, హోటళ్లు, మాల్స్‌ జనంతో రద్దీగా మారుతున్నాయని చెప్పారు. దీంతో కేసుల పెరుగుతున్నాయని తెలిపారు. ప్రజలు జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే థర్డ్‌వేవ్‌ ముప్పు తప్పదని ఆయన హెచ్చరించారు.

ఇది కూడా చదవండిః భారత్ బయోటెక్​ నుంచి మరో టీకా

Advertisement

తాజా వార్తలు

Advertisement