Friday, May 17, 2024

రెండు కార్లు ఢీ.. ముగ్గురు మృతి

రెండు కార్లు ఢీకొని ముగ్గురు మృతిచెందిన విషాద ఘ‌ట‌న రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చేవెళ్లలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇద్దరు పిల్లలతో కలిసి దంపతులు వెళ్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తల్లీబిడ్డ చనిపోగా… తండ్రి మరో కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. చేవెళ్ల మండలంలోని కేసారం గేటు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌ శివరాంపల్లికి చెందిన రవికిరణ్‌, స్రవంతి తమ కుమార్తెలు ధ్రువిక, మోక్షలతో కలిసి వికారాబాద్‌ వైపు వెళ్తుండ‌గా.. కేసారం గేటు వద్దకు రాగానే వేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి స్రవంతి, కుమార్తె ధ్రువిక అక్కడికక్కడే చనిపోయారు. తండ్రి రవికిరణ్‌, మోక్షలకు తీవ్రగాయాలయ్యాయి. అయితే ఈ కారును ఢీకొన్న‌ మరో కారులో ఉన్న వ్యక్తి కూడా మృతిచెందాడు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదంపై విచారణ జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement