Sunday, April 28, 2024

తుక్కు తుక్కుగా కొడతాం కొడకా.. ఎంపీ కవిత సంచలన వ్యాఖ్యలు

కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్ రెడ్డిపై ఎంపీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరుతూ టీఆర్‌ఎస్ ఆధ్యర్యంలో చేపట్టిన ఉక్కు దీక్షలో ఎంపీ మాట్లాడారు. తాము (టీఆర్‌ఎస్ నేతలు) చేతగాని దద్దమ్మలం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారని క‌విత మండిప‌డ్డారు. బయ్యారం ఉక్కును తుక్కుతో పోల్చారని ఆమె ఆరోపించారు. ‘‘మిమ్మల్నే తుక్కు తుక్కుగా కొడతాం కొడకా’’ అని కిషన్ రెడ్డిని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. కేసీఆర్ తెలంగాణ తేవడం వల్లే కిషన్ రెడ్డి కేంద్రమంత్రి అయ్యారని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రాంత హక్కుల కోసం ప్రాణాలకైనా తెగిస్తామని ఎంపీ కవిత స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement