Wednesday, March 27, 2024

RC15కి విలన్‌ని ఫిక్స్ చేసిన డైర‌క్ట‌ర్ శంకర్..!

మెగా హీరో రామ్​ చరణ్ 15వ సినిమాను ఆర్​సీ 15ను శంకర్ డైరెక్ట్​ చేస్తున్నాడు. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే.. ఇది ఆయన బ్యానర్లో వస్తున్న 50వ సినిమా. తన కెరియర్లో అత్యధిక బడ్జెట్ తో నిర్మిస్తున్న మూవీగా కూడా రికార్డు సృష్టించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వాని అలరించనుంది. అయితే ఆల్రెడీ ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను పూర్తిచేసుకుంది. భారీ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు కొన్ని రొమాంటిక్స్ సీన్స్ ను కూడా చిత్రీకరించినట్టు ఫిలింనగర్​ వర్గాల సమాచారం.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాదులోనే జరుగుతోంది.

అయితే.. ఈ సినిమాలో విలన్ గా ఎవరు చేయనున్నారనేది మెగా అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ కేరక్టర్​ కోసం చాలామంది ఆర్టిస్టుల పేర్లను శంకర్ పరిశీలించారట. చివరికి ఎస్.జె. సూర్యను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. దర్శకుడిగా ‘ఖుషీ’ .. ‘వాలి’ వంటి సూపర్ హిట్లను ఇండ‌స్ట్రీకి అందించారు ఎస్.జె. సూర్య.. ఆ తర్వాత నటుడిగా బిజీ అయ్యారు. ముఖ్యంగా ఆయన విలన్ పాత్రలకు ఫేమస్ అయ్యారు. ‘స్పైడర్’ సినిమాతో ప్రతినాయకుడిగా సూర్యకి మంచి మార్కులు వచ్చాయి. ఇక రీసెంట్ గా తమిళంలో వచ్చిన ‘మానాడు’లో చేసిన విలన్ పాత్ర కూడా మరింత పేరును తెచ్చిపెట్టింది.

ఈ సినిమాలో శ్రీకాంత్ కు ఒక ముఖ్యమైన పాత్ర ఉంద‌ట‌.. ఆయన పాత్ర నెగెటివ్ షేడ్స్ తో ఉంటుందని అంటున్నారు. ఆయన పాత్రను శంకర్ డిజైన్ చేసిన తీరు డిఫరెంట్ గా ఉంటుందని చెబుతున్నారు. ఇక ఇతర ముఖ్యమైన పాత్రల్లో అంజలి.. సునీల్.. జయరామ్ కనిపించనున్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement