Monday, April 29, 2024

లారీ-ట్రాక్టర్ ఢీ – ఐదుగురు మృతి – 17మందికి గాయాలు

లారీ, ట్రాక్ట‌ర్ ఢీ కొన్నాయి. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు మృతి చెందారు. కాగా 17మందికి గాయాల‌య్యారు. ఈ సంఘ‌ట‌న ఛత్తీస్ గ‌ఢ్ గ‌రియాబంద్ లో చోటు చేసుకుంది. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అదే సమయంలో, గాయపడిన వ్యక్తులను చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. గరియాబంద్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలోని మెయిన్‌పూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. గరియాబంద్ ఎస్‌డిఎం విశ్వదీప్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. మెయిన్‌పూర్‌లోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఇ భూపేష్ బఘేల్ ఈ విషయంపై సంతాపం వ్యక్తం చేశారు, మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయల సహాయం.. గాయపడిన వారి చికిత్స కోసం 50 వేల రూపాయలను ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement