Friday, May 3, 2024

కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పై టిఆర్ఎస్ ఎంపీల సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పై పార్లమెంట్ ఉభయ సభల్లో టిఆర్ఎస్ ఎంపీల సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ఇచ్చారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో పీయూష్ గోయల్ సమాధానం పార్లమెంట్ ను తప్పుదోవ పట్టించేలా ఉందని ఎంపీలు పేర్కొన్నారు. డబ్ల్యూటివో నియమావళి నేపథ్యంలో పారా బాయిల్డ్ రైస్ విదేశాలకు ఎగుమతులు చేయలేమని కేంద్ర మంత్రి సభను తప్పుదోవ పట్టించారని తెలిపారు. కానీ కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్ లో మిలియన్ టన్నుల పారా బాయిల్డ్ రైస్ విదేశాలకు ఎగుమతి చేసినట్లు ఉందని ఎంపీలు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement