Monday, April 29, 2024

Bigg Boss షోలో టీఆర్ఎస్ ఎంపీ.. అడవి దత్తత తీసుకున్న నాగ్!

తెలుగు రియాల్టీ షో ‘బిగ్ బాస్’లో టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌ స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో నాగార్జునతో కలిసి వేదికపై సందడి చేశారు. బిగ్‌బాస్‌ హౌస్‌లో మొక్క నాటారు. ఈ సంరద్భంగా వెయ్యి ఎకరాల అడవిని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని బిగ్ బాస్ షో హోస్ట్, సినీ హీరో అక్కినేని నాగార్జున ప్రకటించారు. సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ స్ఫూర్తితో అడవిని దత్తత తీసుకొంటున్నట్టు చెప్పారు. వాతావరణ మార్పులను అడ్డుకోవాలంటే ప్రజలంతా బాధ్యతగా మొక్కలు నాటాలని నాగార్జున పిలుపునిచ్చారు. తాను వచ్చే మూడు వారాలు మూడు మొక్కలు నాటుతానని నాగార్జున చెప్పారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్ఫూర్తితోనే గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ను ముందుకు తీసుకెళ్తున్నట్టు ఎంపీ సంతోష్ కుమార్ తెలిపారు. గ్రీన్‌ చాలెంజ్‌ను విజయవంతం చేస్తున్నవారందరికీ ధన్యవాదాలు తెలిపారు. గ్రీన్‌ చాలెంజ్‌లో భాగంగా మూడేళ్లలో ఇప్పటివరకు 16 కోట్లకుపైగా మొక్కలు నాటినట్టు సంతోష్‌ కుమార్‌ వెల్లడించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement