Monday, April 29, 2024

బీజేపీలో చేరికపై కుండబద్దలు కొట్టిన టీఆర్ఎస్ ఎంపీ

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరాక టీఆర్ఎస్ నుంచి భారీ వలసలు ఉంటాయని చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కూడా బీజేపీలో చేరబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. టీఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న పాటిల్.. ఈటల దారిలో కాషాయ కండువా కప్పుకుంటారని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీ స్పందించారు.  

తాను బీజేపీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ తీవ్రంగా ఖండించారు. తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్నవార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. తాను టీఆర్ఎస్ పార్టీని వీడేది లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. సీఎం కేసీఆర్‌ సహా మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి తనకు పూర్తి సహకారం లభిస్తుందని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీని వీడే ఆలోచన ఏ మాత్రం లేదని స్పష్టం చేశారు. తానంటే గిట్టని వారు తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. అసత్య ప్రచారం చేస్తున్న చానళ్లు, వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఎంపీ బీబీ పాటిల్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement