Wednesday, April 24, 2024

చిత్తూరు యాసలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రవితేజ ?

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమా తర్వాత రవితేజ శరత్ మండవ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రవితేజ చిత్తూరు యాస లో మాట్లాడతారట. కాగా రవితేజ ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించనున్నారని ఆయన… యాక్టింగ్ ఫుల్ కామెడీతో ఉంటుందని అంటున్నారు. ఇక ఎస్ ఎల్ వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement