Sunday, May 5, 2024

Flash: బీజేపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత.. టీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్

గిరిజన రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంటును తప్పుదోవ పట్టించిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గిరిజన సంఘాలు, టీఆర్ఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ఎదుట బుధ వారం ధర్నా నిర్వహించారు. బీజేపీ గిరిజనులను అవమానించే విధంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ తక్షణమే కేంద్రమంత్రి విశ్వేశ్వర్ ను బర్తరఫ్ చేయాలని ధర్నాలో పాల్గొన్న నేతలు డిమాండ్ చేశారు. నిరసన కారులను పోలీసులు అరెస్టు చేసి నారాయణ గూడ, చిక్కడపల్లి, అబిడ్స్, గోషామహల్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అరెస్టయిన వారిలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, యువజన విభాగం నేత పల్లా ప్రవీణ్ రెడ్డి, గిరిజన నేత రాం బాబు నాయక్ తదితర ప్రముఖులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement