Sunday, May 5, 2024

Breaking: మేడారం తొవ్వ‌లో.. ట్రాఫిక్ జామ్

మేడారం (ప్రభ న్యూస్): ఆదివాసి గిరిజన కుంభమేళాకు భక్తజనం పోటెత్తారు. జాతర మరో మూడు రోజులు గడువు ఉండటంతో మహిమాన్విత తల్లులైన వనదేవతలు సమ్మక్క సారలమ్మ జాతరకు ఇప్పటి నుండే భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆదివారం భారీగా భక్తులు వస్తుండటంతో తాడ్వాయి మేడారం మధ్య‌లో 2 కిలోమీటర్ల మేర వాహ‌నాలు నిలిచిపోయాయి.

వీఐపీ పార్కింగ్ స్థలంలో ట్రాఫిక్ జామ్‌ కావడంతో ఆర్టీసీ బస్సులు తాడ్వాయి నుండి మేడారం వచ్చే రోడ్డు పై ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ట్రాఫిక్ లో చిక్కుకొని భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు కృషి చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement