Thursday, May 16, 2024

టాలీవుడ్ ప‌బ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి : ప‌లువురి అరెస్ట్

టాలీవుడ్ ప‌బ్ పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆక‌స్మికంగా దాడుల‌కు పాల్ప‌డ్డారు. ప‌బ్ లో వికృత చేష్ట‌ల‌కు పాల్ప‌డుతున్న తొమ్మిది మంది యువ‌తులు, 34మంది యువ‌కుల‌ను వారు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘ‌ట‌న హైద‌రాబాద్ పంజాగుట్ట ప‌రిథిలో చోటు చేసుకుంది. అలాగే పబ్‌లో సమయం దాటిన తర్వాత కూడా యువతి యువకులు అర్థనగ్న డ్యాన్స్‌లు చేస్తున్నారని సమాచారం. ఇటీవలే ఈ పబ్‌పై ఎక్సైజ్, పంజాగుట్ట పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపి నోటీసులు జారీ చేశారు. అయితే గతంలోనూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా వుంది టాలీవుడ్ పబ్. ఇటీవలే పబ్‌కు వచ్చిన భార్యాభర్తలపై పబ్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో పాటు దాడి చేయడంతో కొంత కాలం సీజ్ చేశారు పంజాగుట్ట పోలీసులు. ఈ మ‌ధ్య‌కాలంలో మ‌ళ్ళీ శృతిమించుతున్నాయి ప‌బ్ ల ప‌రిస్థితి.

Advertisement

తాజా వార్తలు

Advertisement