Thursday, May 2, 2024

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.150 మేర తగ్గింది ప్రస్తుతం.. రూ.51 వేల 350 వద్దకు చేరింది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి తులం హైదరాబాద్‌లో రూ.160 మేర పడిపోయింది. ప్రస్తుతం రూ.56,020 మార్కు వద్ద ఉంది. దేశ రాజధాని దిల్లీ బులియన్ మార్కెట్లో కూడా బంగారం రేట్లు తగ్గాయి. దిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 150 తగ్గి ప్రస్తుతం రూ.51,500 వద్ద ఉంది. అలాగే 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.160 తగ్గి ప్రస్తుతం రూ.56,170 వద్ద కొనసాగుతోంది. పసిడి రేట్లతో పాటు వెండి రేట్లు సైతం భారీగా పడిపోతున్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి తాజాగా రూ.1000 మేర పడిపోయింది. ప్రస్తుతం రూ.69,000కు దిగొచ్చింది. మరోవైపు దేశ రాజధాని దిల్లీలో వెండి ధర కిలోకు రూ.700 తగ్గింది. ప్రస్తుతం రూ.66 వేల 800 మార్క్ వద్ద ఉంది. హైదరాబాద్‌తో పోలిస్తే దిల్లీలో వెండి చాలా తక్కువగా ఉంటుంది. గోల్డ్ మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటుంది. స్థానికంగా ఉండే ట్యాక్స్‌లోను బట్టి ఈ రేట్లలో మార్పులు ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement