Saturday, May 4, 2024

నేడు మంగ‌ళ్ పాండే జ‌యంతి-నివాళుల‌ర్పించిన ప్ర‌ధాని మోడీ

నేడు మంగ‌ళ్ పాండే జ‌యంతి. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆ వీరుడికి నివాళుల‌ర్పించారు. భార‌త స్వతంత్ర సంగ్రామంలో ఎంద‌రో వీరులు ఆంగ్లేయుల పాల‌న‌కు వెన్నుచూప‌కుండా పోరాడారు. వారిలో మంగ‌ళ్ పాండే ఒక‌రు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని మీర‌ట్‌లో మంగ‌ళ్ పాండేకు చెందిన నిలువెత్తు విగ్ర‌హాన్ని గ‌తంలోనే ఏర్పాటు చేశారు. ఈ విగ్ర‌హం వ‌ద్ద‌కు వెళ్లిన మోడీ… స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడికి నివాళి అర్పించారు. ఈ ఫొటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన మోడీ… మంగ‌ళ్ పాండే వీర‌త్వాన్ని కీర్తించారు. ఓ సంక‌ల్పంతో ధైర్యంగా ముందుకు సాగిన మంగ‌ళ్ పాండే వేలాది మంది భార‌తీయుల్లో పోరాట ప‌టిమ‌ను ర‌గిల్చార‌ని ఆయ‌న‌ను కీర్తించారు ప్ర‌ధాని.

Advertisement

తాజా వార్తలు

Advertisement