Wednesday, May 15, 2024

Spl Story: బాలీవుడ్​లో సత్తా చాటనున్న సౌత్​ భామలు.. రిలీజ్​కు రెడీగా ఉన్న సినిమాలు ఏంటంటే..

సినీ ఇండస్ట్రీలో ఇప్పటిదాకా సౌత్​​ ఇండియన్​, నార్త్​ ఇండియన్​ అనే అడ్డుగొడ ఉండేది. ఈ మధ్య కాలంలో వస్తున్న పాన్​ ఇండియా మూవీస్​తో ఆ అడ్డుగోడ కాస్త బద్ధలైంది. ఇక సినీ ఇండస్ట్రీ అంటే ఒకప్పుడు బాలీవుడ్​దే పెత్తనం సాగేది. కానీ, ఇప్పుడు దక్షిణాది సినిమాల హవా కూడా బాగానే కొనసాగుతోంది.  అందులో భాగంగా మన ఇండస్ట్రీ నుంచి ఎంతో మంది కుర్ర హీరోయిన్లు బాలీవుడ్​ సినిమాల్లో నటిస్తూ అక్కడా సత్తా చాటుతున్నారు. అంతేకాకుండా బాలీవుడ్​ బామలు దీపికా, అలియాభట్​ కూడా తెలుగు సినిమాల్లో అప్పుడప్పుడూ మెరుస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

బాలీవుడ్, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మధ్య క్రాస్ఓవర్ ఇప్పుడు పెద్ద షాకింగ్ ఏమీ కాదు. దక్షిణ భారత హీరోయిన్లు బి-టౌన్‌లోకి ప్రవేశించడం.. పెద్ద బ్యానర్ చిత్రాల్లో నటించడం అనేది ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. చాలా మంది బాలీవుడ్ నటీమణులు సౌత్ చిత్రాలలో నటించడం కూడా చూడొచ్చు. దీంతో భారతీయ సినిమా వైవిధ్యం పెరిగింది. అలియా భట్ RRR మూవీలో ఫుల్​ లెంగ్త్​ హీరోయిన్​గా నటించింది. ప్రాజెక్ట్ K మూవీలో ప్రభాస్‌తో దీపికా పదుకొనే నటిస్తోంది. దీంతో B-టౌన్​ని సౌత్ టౌన్ సినిమాలను పూర్తిగా శాసిస్తున్నాయని అంటున్నారు మూవీ క్రిటిక్స్​.. అదేవిధంగా.. రాశి ఖన్నా నుంచి రష్మిక మందన్న దాకా త్వరలో బాలీవుడ్​లో నటిస్తున్నారు. త్వరలో బాలీవుడ్ విడుదల కాబోతున్న వీరి సినిమాలు, లుక్​ ఏంటో పరిశీలిద్దాం 

రష్మిక మందన్న..

పుష్ప సినిమాలో హిట్ సాంగి “సామి.. సామి” అంటూ తనదైన స్టైల్​లో దేశాన్ని, యువతను కిర్రెక్కించింది రష్మిక మందన్న. ఇప్పుడు స్పై థ్రిల్లర్ మూవీ మిషన్ మజ్నులో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. అంతేకాకుండా తన ఖాతాలో మరికొన్ని ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఆమె గుడ్‌బై చిత్రం కోసం అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్‌లతో కలిసి పని చేస్తోంది.

- Advertisement -

రాశి ఖన్నా..

తన తాజా మూవీ ‘‘పక్కా కమర్షియల్’’తో పాటు విడుదలకు రెడీగా ఉన్న ‘‘థాంక్యూ”మూవీ ట్రైలర్‌తో అందరి నోట ప్రశంసలు అందుకుంటోంది రాశి ఖన్నా. ఇప్పుడు పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. ధర్మ ప్రొడక్షన్​ వారి యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘యోధా’లో సిద్ధార్థ్ మల్హోత్రాతో నటిస్తోంది. దీంతో బాలీవుడ్​లో అరంగేట్రం చేసింది. అంతేకాకుండా షాహిద్ కపూర్‌తో కలిసి రాజ్, DK యొక్క వెబ్ సిరీస్ “ఫర్జీ” కోసం కూడా పని చేస్తోంది. ఇవి కాకుండా రాశి తన ఖాతాలో ఇంకొన్ని ప్రకటించని ప్రాజెక్ట్ లున్నట్టు తెలుస్తోంది.

నయనతార..

తన పెళ్లి, హాలిడీ ట్రిప్​లతో  ఇటీవల ఇంటర్నెట్‌లో తుఫానుగా మారింది నయనతార. చివరకు బాలీవుడ్ బాద్​షా షారూఖ్ ఖాన్ సరసన నటించేందుకు రెడీగా ఉంది. రాబోయే చిత్రం ‘జవాన్’ కోసం బి-టౌన్​లో అరంగేట్రం చేస్తూ.. షూటింగ్ ప్రారంభించింది.

పూజా హెగ్డే..

పూజా హెడ్గే గతంలో బాలీవుడ్ సినిమాలు చేసి ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆమె సినిమాలు బి-టౌన్ లో ఇప్పుడు మరిన్ని విడుదలకు సిద్దంగా ఉన్నాయి. సల్మాన్ ఖాన్‌తో ‘‘కభీ ఈద్ కభీ దీపావళి’’.. రణవీర్ సింగ్‌తో రోహిత్ శెట్టి సర్కస్ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇవి కాకుండా ఆమెకు అనేక సౌత్ ప్రాజెక్ట్ లు, కొన్ని ప్రకటించని బాలీవుడ్ ప్రాజెక్ట్ లు కూడా ఉన్నాయి.

సమంత ప్రభు..

ఈ మధ్య ఐటెం సాంగ్​లో నటించి అందరినీ ఉర్రూతలూగించింది సమంత. తన లవ్​ అండ్​ మ్యారేజీ బ్రేకప్​ తర్వాత నటిగా మరింత బిజీ అయిపోయింది ఈ అమ్మడు. ఇప్పుడు కొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్ లకు సిద్ధమవుతోంది. ఈ అమ్మడు నటించిన ‘‘యశోద’’ వచ్చే నెల ఆగస్ట్ లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది ఫిక్షన్ థ్రిల్లర్ గా అందరినీ అలరిస్తుందని చెబుతున్నారు మేకర్స్​.

Advertisement

తాజా వార్తలు

Advertisement