Wednesday, May 15, 2024

మల్లికార్జున దేవస్థాన అభివృద్ధికి నిధులివ్వండి…దేవాదాయ మంత్రిని కోరిన ఎమ్మెల్యే దాసరి

ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయ అభివృద్ధి కి నిధులు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి విన్నవించారు. మంగళవారం హైదరాబాదులో మంత్రిని కలిసి పురాతన దేవాలయం అయిన మల్లికార్జున స్వామి ఆలయానికి ప్రతినిత్యం వేలాది మంది భక్తులు వస్తున్నారని, వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.

ఆలయ అభివృద్ధికి ఆరున్నర కోట్ల రూపాయలు కేటాయించాలని వినతి పత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయ కమిటీ మేకల మల్లేశం యాదవ్ ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement