Tuesday, April 30, 2024

కొత్త‌గా 14,092క‌రోనా కేసులు

ఇండియాలో కొత్త‌గా 14,092క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. పాజిటివిటీ రేటు 4.36 శాతానికి తగ్గింది. రికవరీ రేటు 98.54 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.26 శాతానికి పడిపోయాయి.భారత్​లో శనివారం 28,01,457 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 2,07,99,63,555కు చేరింది. మరో 3,81,861మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.ప్రపంచ దేశాల్లోనూ కరోనా విలయం కొనసాగుతోంది. కొత్తగా 5,78,704మంది వైరస్​ బారినపడగా.. మరో 1,318 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య 59,45,50,623కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 64,53,327 మంది మరణించారు. ఒక్కరోజే 7,60,524 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 56,75,23,279కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement