Saturday, May 4, 2024

Big Breaking | కారును ఢీకొట్టిన టిప్పర్​.. స్పాట్​లోనే నలుగురు మృతి

హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు, కటాక్షపూర్ ప్రధాన రహదారిపై ఇవ్వాల (ఆదివారం) సాయంత్రం జరిగిన ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. కారు డ్రైవర్ తో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా కారులో మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్టు సమాచారం.

ఇక.. టిప్పర్ బలంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు కాగా, తీవ్ర గాయాలపాలైన వారు కారులోనే ప్రాణాలు విడిచినట్లు స్తానికులు చెబుతున్నారు. చనిపోయిన వారిలో ఇద్దరు మగాళ్లు, ఇద్దరు ఆడాళ్లున్నారు. వీరంతా గ్రేటర్ వరంగల్ పరిధిలోని కాశిబుగ్గకు చెందిన వారుగా తెలుస్తోంది. మృతిచెందిన వారిలో అనుముల నరసింహ చారి, వెల్డండి సాంబరాజు, వెల్డెండి ఆకాంక్ష, వెల్దండి లక్ష్మి ప్రసన్నగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారిని ఎంజీఎం ఆస్పత్రికి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement