డిసెంబర్ 12న టీనా అంబానీ కుమారుడు అన్మోల్ 30వ పుట్టిన రోజు సందర్భంగా ఒక పోస్ట్ ని షేర్ చేశారు. కాగా అదే రోజు క్రిషా షాతో అతని నిశ్చితార్థం గురించి వార్తలు వచ్చాయి. టీనా అంబానీ మేనకోడలు అంటారా మోతివాలా మార్వా, అన్మోల్, క్రిషాల ఫొటోలని ఇన్ స్టాలో షేర్ చేశారు. కాగా అన్మోల్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడని, అతన్ని చాలా మిస్ అవుతున్నట్టు టీనా అంబానీ ఓ పోస్ట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ముఖ్యంగా అన్మోల్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన ఒక సంవత్సరంలో అతన్ని చాలా మిస్ అవుతున్నాను” అని టీనా అంబానీ రాశారు. టీనా అంబానీ తన మామ ధీరూభాయ్ అంబానీని గుర్తుచేసుకుంటూ ఒక పోస్ట్ను పంచుకున్నారు.
ఆమె కుమారుడు అన్మోల్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన ఒక సంవత్సరంలో అతను చాలా మిస్ అవుతున్నానని రాశారు. భారతదేశంలోని గొప్ప పారిశ్రామికవేత్తలలో ఒకరిగా పరిగణించబడుతున్న ధీరూభాయ్ అంబానీ 2002లో ముంబైలో భారీ స్ట్రోక్తో మరణించారు. తన పోస్ట్లో, టీనా అంబానీ అతన్ని కేవలం “విప్లవాత్మక వ్యక్తి” మాత్రమే కాకుండా “ఉదాత్త, సౌమ్య ,ఉదార” వ్యక్తిగా కూడా గుర్తు చేసుకున్నారు. పప్ప తన సమయాన్ని, నైపుణ్యాన్ని, సహనాన్ని, అభ్యాసాలను మనందరికీ అందించారని అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital
.