Tuesday, April 30, 2024

బీజేపీ సీఎంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ.. ఏం జరుగుతోంది?

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైతో మల్కాజ్‌గిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు భేటీ అయ్యారు. తన కుటుంబ సభ్యులతో కలసి బెంగళూరులో సీఎం బొమ్మైని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మర్యాదపూర్వకంగా కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మైని కలిసినట్లు తెలిపారు. అయితే బీజేపీ ముఖ్యమంత్రితో టీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.

తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంత శత్రుత్వం ఉంది. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం టీఆర్ఎస్, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపిస్తోంది. గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ ఉన్నట్లుగా వీరి మద్య ఒప్పందం ఉందంటూ హస్తం నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి.. ఇప్పుడు బీజేపీ సీఎంతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సోషల్ మీడియా పోస్టుపై కూడా నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement