Friday, May 3, 2024

ఫోర్త్ వేవ్‌కు భయపడాల్సిందేం లేదు.. భారత్ బయోటెక్ ఫౌండ‌ర్‌ కృష్ణ ఎల్లా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా ఫోర్త్ వేవ్‌కు భయపడాల్సిందేమీ లేదని భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు కృష్ణ ఎల్లా స్పష్టం చేశారు. శనివారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ వైరాలజిస్ట్ ప్రొఫెసర్ జాకబ్ జాన్ రచించిన ‘పోలియో’ పుస్తకాన్నిఆయన ఆవిష్కరించారు. అనంతరం కృష్ణ ఎల్లా మీడియాతో మాట్లాడుతూ… జాకబ్ జాన్ సేవలను కొనియాడారు. ఫోర్త్ వేవ్ లక్షణాలు స్వల్పంగా ఉంటాయని తెలిపారు.

ఇప్పటికే దేశమంతా కరోనా వ్యాక్సినేషన్ అయిందని, కోవిడ్ వ్యాక్సిన్‌ను ఎదుర్కొనే పూర్తి సామర్థ్యం ప్రజలకు వచ్చిందని ఆయన వివరించారు. మూడో డోసు వ్యాక్సిన్ వేసుకుంటే అందరికీ మంచిదని, అలాగే మాస్క్ కూడా ధరించాలని సూచించారు. నేజల్ వ్యాక్సినేషన్‌పై ఇప్పుడే ఏమీ చెప్పలేమని కృష్ణ ఎల్లా అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement