Thursday, May 2, 2024

అప్పుడు శారీ – ఇప్పుడు ప్యాంట్ – పోలింగ్ ఆఫీస‌ర్ స్టైలే వేర‌ప్ప‌

యూపీలో 2019లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎల‌క్ష‌న్ స‌మ‌యంలో పోలింగ్ అధికారిణి రీనా ద్వివేది గుర్తున్నారా. మ‌రోసారి ఆమె పేరు మారు మ్రోగుతోంది. అప్ప‌ట్లో ఆమె డ్రెస్సింగ్ స్టైల్ తో ట్రెండ్ గా మారారు. యెల్లో క‌ల‌ర్ శారీతో పాపుల‌ర్ అయ్యారు.యెల్లో సారీ క‌ట్టుకొని, సన్‌ గ్లాసెస్ పెట్టుకుని ఈవీఎంల‌ను ప‌ట్టుకొని త‌ను పోలింగ్ స్టేష‌న్‌లోకి వెళ్లే స‌మ‌యంలో తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.రీనా ద్వివేది ఫొటోలు వైరల్‌గా మారడంతో.. ఫుల్ ఫేమస్ అయిపోయారు. కొద్ది రోజుల పాటు ఆమె గురించి విపరీతమైన సోషల్ మీడియాలో చర్చ సాగింది. మ‌రి ఇప్పుడు మోడ్ర‌న్ డ్రెస్ లో మెరిసింది. యూపీలో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ఆఫీసర్‌గా ఉన్న ఆమె.. ఈసారి స్లీవ్‌లెస్ బ్లాక్ టాప్, లేత గోధుమరంగు ప్యాంటు ధరించి పోలింగ్ బూత్‌కు వచ్చారు.

లక్నోలోని గోసాయిగంజ్ బూత్ నంబర్ 114లోని బస్తియాలోని పోలింగ్ స్టేషన్‌కు రీనా వస్తున్నప్పుడు తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆమెను గుర్తించిన కొందరు సెల్ఫీలు కూడా తీసుకున్నారు.ఆమె తన డ్రెస్సింగ్ స్టైల్‌లో మార్పు గురించి అడిగినప్పుడు..“తోడా చేంజ్ హోనా చాహియే (కొంచెం మార్పు అవసరం)” అని చెప్పారు. రీనా ద్వివేది గతంలో బిగ్‌బాస్‌ షోకు వెళ్లాలనే ఉందనే తన మనసులో భావాలను వ్యక్తం చేసింది. రీనా ద్వివేదికి ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె తరచుగా తన ఫొటోలను షేర్ చేస్తుంటారు. ఇక, రీనా ద్వివేది విషయానికి వస్తే.. ఆమె పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ లక్నో కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు ఫ్యాషన్‌పై చాలా ఆసక్తి. డియోరియాకు చెందిన ఆమెకు చిన్నతనం నుంచి ఫిట్‌గా ఉండటం అంటే ఇష్టం. తాను ధరించే దస్తులపై ఆమె ఎక్కువ శ్రద్ధ వహిస్తుంది. అందంగా కనిపించేలా చూసుకుంటుంది. సినిమా హీరోయిన్ లా మెరిసిపోతుండం ఆమెకి ఇష్ట‌మ‌ట‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement