Saturday, May 4, 2024

Telangana: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా రెడీ చేయాలి.. షెడ్యూల్​ ప్రకటించిన ఈసీ

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల జాబితా తయారీకి ఈసీ షెడ్యూల్‌ను ప్రకటించింది. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక ఓటర్ల జాబితా ప్రక్రియ శనివారం నుంచి షురూకానున్నది. ప్రస్తుత ఎమ్మెల్సీ కే జనార్ధన్‌రెడ్డి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29న ముగియనున్నది. ఈ క్రమంలో నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు నిర్వహించేందుకు ఓటర్ల జాబితా తయారీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది.

డీనోవా పద్ధతిలో ఓటరు జాబితా తయారీకి ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ఇవ్వగా.. దీని ప్రకారం గతంలో ఉన్న ఓటుహక్కుతో సంబంధం లేకుండా మళ్లీ ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. ఓటు హక్కు కోసం అర్హులైన ఉపాధ్యాయులు ఫారం-18 సమర్పించాల్సి ఉంటుంది. ఓటుహక్కు కోసం శనివారం నుంచి నవంబర్‌ 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఈసీ అవకాశం ఇచ్చింది. నవంబర్ 23న ఓటరు జాబితా ముసాయిదా ప్రకటించి, డిసెంబర్‌ 9 వరకు అభ్యంతరాలు, వినతులు స్వీకరిస్తారు. డిసెంబర్ 30న ఓటర్ల తుది జాబితాను అధికారులు ప్రకటించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement