Monday, May 6, 2024

బాక్సాఫీస్ వద్ద ‘ది కశ్మీర్ ఫైల్స్’ దండయాత్ర.. రూ.150 కోట్ల వసూళ్లు

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా వసూళ్లలో దుమ్మురేపుతోంది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ది కాశ్మీర్ ఫైల్స్ బాక్సాఫీస్ వద్ద తన దండయాత్రను కొనసాగించింది. ఈ చిత్రం విడుదలైనప్పటి నుండి అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. మార్చి 11న విడుదలైన ఈ సినిమా కేవలం ఏడు రోజుల్లోనే రూ. 100 కోట్లు రాబట్టింది. ఇప్పటి వరకు రూ. 140.95 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ సినిమా రూ. 150 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. 9వ రోజున రూ. 24.50 కోట్లు సాధించింది. దీంతో ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 140.95 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ వారంలోనే ఇది రూ. 150 కోట్ల మార్కును దాటుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాను 1990లో కశ్మీర్ తిరుగుబాటు సమయంలో కశ్మీరీ  హిందువుల వలసల ఆధారంగా రూపొందించారు. అనుపమ్‌ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి తదితరులు నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement