Friday, April 26, 2024

ఏడు రోజుల్లో రూ.100కోట్లు – రూ.150కోట్ల దిశ‌గా ‘ది క‌శ్మీర్ పైల్స్’ మూవీ

బాలీవుడ్ చిత్రం ది క‌శ్మీర్ పైల్స్ దూకుడు కొన‌సాగుతోంది. వ‌సూళ్ల‌తో దుమ్ము రేపుతోంది. కాగా ఈ చిత్రాన్ని వివేక్ అగ్నిహోత్రి తెర‌కెక్కించాడు. ఇప్ప‌టి వరకు రూ. 140.95 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ సినిమా రూ. 150 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. మార్చి 11న విడుదలైన ఈ సినిమా కేవలం ఏడు రోజుల్లోనే రూ. 100 కోట్లు రాబట్టింది. 9వ రోజున రూ. 24.50 కోట్లు సాధించింది. ఫలితంగా ఇప్పటి వరకు ఈ సినిమా సాధించిన వసూళ్లు రూ. 140.95 కోట్లకు చేరుకున్నాయి. ఈ వారంలోనే ఇది రూ. 150 కోట్ల మార్కును దాటుతుందని చెబుతున్నారు. 1990లో కశ్మీర్ తిరుగుబాటు సమయంలో కశ్మీరీ హిందువుల వలసల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. అనుపమ్‌ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి తదితరులు నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement